unfoldingWord 41 - దేవుడు యేసును మృతులలోనుండి లేపడం
ರೂಪರೇಖೆಯನ್ನು: Matthew 27:62-28:15; Mark 16:1-11; Luke 24:1-12; John 20:1-18
ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಸಂಖ್ಯೆ: 1241
ಭಾಷೆ: Telugu
ಪ್ರೇಕ್ಷಕರು: General
ಉದ್ದೇಶ: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
ಸ್ಥಿತಿ: Approved
ಸ್ಕ್ರಿಪ್ಟ್ಗಳು ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ ಮತ್ತು ರೆಕಾರ್ಡಿಂಗ್ಗೆ ಮೂಲ ಮಾರ್ಗಸೂಚಿಗಳಾಗಿವೆ. ಪ್ರತಿಯೊಂದು ವಿಭಿನ್ನ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಭಾಷೆಗೆ ಅರ್ಥವಾಗುವಂತೆ ಮತ್ತು ಪ್ರಸ್ತುತವಾಗುವಂತೆ ಅವುಗಳನ್ನು ಅಗತ್ಯವಿರುವಂತೆ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಬಳಸಿದ ಕೆಲವು ನಿಯಮಗಳು ಮತ್ತು ಪರಿಕಲ್ಪನೆಗಳಿಗೆ ಹೆಚ್ಚಿನ ವಿವರಣೆ ಬೇಕಾಗಬಹುದು ಅಥವಾ ಬದಲಾಯಿಸಬಹುದು ಅಥವಾ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಿಟ್ಟುಬಿಡಬಹುದು.
ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಪಠ್ಯ
సైనికులు యేసును సిలువ వేసిన తరువాత యూదా నాయకులు పిలాతుతో ఇలా చెప్పారు, “ఆ అబద్ధికుడు, యేసు మూడు రోజుల తరువాత మృతులలో నుండి తిరిగి లేస్తానని చెప్పాడు. శరీరాన్ని సమాధిలోనుండి శిష్యులు ఎత్తికొనిపోకుండా దానిని కాపాడాలి. వారు ఆ విధంగా చేస్తే, ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని చెపుతారు.”
పిలాతు ఇలా చెప్పాడు, “కొందరు సైనికులను తీసుకొని వెళ్ళండి, సమాధిని మీ చేతనైనంత వరకు భద్రపరచండి.” కనుక సమాధి మీద ఉన్న రాతి మీద ముద్ర వేసారు. దేహాన్ని ఎవరూ దొంగిలించకుండా సైనికులను కావలి యుంచారు.
యేసు చనిపోయిన మరుసటి రోజు సబ్బాతు దినం. ఏ ఒక్కరూ సబ్బాతు దినాన పని చెయ్యరు. కనుక యేసు స్నేహితులెవరూ సమాధి వద్దకు వెళ్ళలేదు. అయితే సబ్బాతు దినం మరుసటి రోజు ఉదయాన్నే అనేక మంది స్త్రీలు యేసు దేహాన్ని ఉంచిన సమాధి వద్దకు వెళ్ళడానికి సిద్దపడ్డారు. యేసు దేహానికి ఎక్కువ సుగంధ ద్రవ్యాలు పూయాలని కోరారు.
ఆ స్త్రీలు సమాధి వద్దకు రావడానికి ముందు సమాధి వద్ద గొప్ప భూకంపం కలిగింది. పరలోకం నుండి ఒక దూత వచ్చాడు. సమాధి ద్వారాన్ని మూసియుంచిన రాయిని తొలగించాడు. దాని మీద కూర్చుండి యున్నాడు. ఆ దూత మెరుపులా ప్రకాశమానంగా వెలిగిపోతున్నాడు. సమాధి వద్ద సైనికులు ఆ దూతను చూచారు. వారు చాలా భయపడ్డారు కనుక వారు చచ్చిన వారిలా నేల మీద పడిపోయారు.
ఆ స్త్రీలు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ దూత వారితో ఇలా చెప్పాడు, “భయపడకండి, యేసు ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధంగా మరణం నుండి తిరిగి లేచాడు! సమాధిలో చూడండి.” ఆ స్త్రీ యేసు దేహాన్ని ఉంచిన సమాధిలోనికి తొంగి చూసింది. ఆయన దేహం అక్కడ లేదు!
దూత ఆ స్త్రీతో ఇలా చెప్పాడు, “మీరు వెళ్ళండి, ‘మరణం నుండి యేసు తిరిగి లేచాడు, మీకు ముందుగా గలిలయకు వెళ్తాడని శిష్యులతో చెప్పండి.”
ఆ స్త్రీలు మిక్కిలో ఆశ్చర్యపడ్డారు, ఆనందించారు. సంతోషకరమైన వార్తను శిష్యులకు చెప్పాడానికి వారు పరుగెత్తి వెళ్ళారు.
సంతోషకరమైన వార్తను శిష్యులకు చెప్పడానికి వారు పరుగున వెళ్తుండగా యేసు వారికి ప్రత్యక్ష్యం అయ్యాడు. వారు ఆయన పాదాల వద్ద మొక్కారు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, “భయపడకండి. శిష్యులు గలిలయకు వెళ్ళమని చెప్పండి. ఆక్కడ వారు నన్ను చూస్తారు.”